మట్టపల్లి నృసింహ స్వామి ఆలయం కృష్ణానదీ తీరాన ఉన్నది. తంగెడ రాజ్యాన్ని పాలిస్తున్న అనుముల మాచి రెడ్డి అనే రాజుకు లక్ష్మీ నరసింహస్వామి కలలో కనపడి తాను సమీప అడవిలో ఒక గుహలో కొలువై ఉన్నానని తెలిపాడు. స్వామివారిని కనుగొనుటకు అడవిలో విశ్వప్రయత్నం చేసి చింతిస్తున్న మాచి రెడ్డి కి స్వామి మళ్ళీ కలలో కనపడి సమీపంలోని ఆరెచెట్టుపైనున్న గరుడ పక్షి కి సూటిగా కొంత దూరంలోని గుహలో ఉన్నానని తెలియజేసాడు. ఆ విధంగా స్వామివారిని దర్శించుకున్న మాచిరెడ్డి దేవాలయ నిర్మాణానికి పాటుపడ్డాడు. భువనాశదేవి మాచిరెడ్డి కోడలు. ఆమె చరిత్రలో కూడా మట్టపల్లి నృసింహ స్వామివారి ప్రస్తావన ఉంది.
మట్టపల్లి దేవాలయం ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రసిధ్ధి. మానసిక రుగ్మతలు, పిల్లలు లేని దంపతులు ఎక్కువగా స్వామివారిని సందర్శించి స్వాంతన పొందుతుంటారు.
Mattapalli Narasimha Swamy Temple Nalgonda Telangaana
మట్టపల్లి దేవాలయం ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రసిధ్ధి. మానసిక రుగ్మతలు, పిల్లలు లేని దంపతులు ఎక్కువగా స్వామివారిని సందర్శించి స్వాంతన పొందుతుంటారు.
Mattapalli Narasimha Swamy Temple Nalgonda Telangaana









No comments:
Post a Comment